ASR: పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు లబ్దిదారులకు సూచించారు. శనివారం మూలపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి రవీంద్రతో కలిసి ఇంటింటికీ తిరిగి స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.