BPT: జిల్లాలో ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి యోగా చేశారు. ఆయనతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యత గురించి కలెక్టర్ వివరించారు.