NGKL: కాంగ్రెస్ పార్టీ డెలిమిటేషన్ కమిటీ చైర్మన్గా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మరో ఆరుగురికి చోటు కల్పించారు. దేశవ్యాప్తంగా జరిగే డెలిమిటేషన్ ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆయనకి ఈ పదవి దక్కడం పట్ల అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.