కోనసీమ: నిరుద్యోగ సమస్య నిర్మూలనలో భాగంగా రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జూన్ 3న, ఉదయం 9:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. టెన్త్ నుండి ఆ పైన చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, వివరాలకు 9515481671 నెంబర్లో సంప్రదించాలన్నారు.