KNR: దళితులను దగా చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కవితకు, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే తొలి సీఎం దళితుడే ఉంటాడని చెప్పి కేసీఆర్ మాట తప్పలేదా అని ప్రశ్నించారు. దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ను మీడియా ముందు నెట్టేస్తూ అవమానించారని మండిపడ్డారు.