VZM: మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి రేషన్ వాహనాలు రద్దు చేయమని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాలు రద్దు చేయబోమని చెప్పి జిల్లా పరిషత్లో హామీ ఇచ్చిన మాట నేడు ఏమైనట్లని అన్నారు.