ప్రకాశం: తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అందరూ కలిసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.