VZM: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ ప్రారంభమయ్యింది. ఇప్పటికే 5 రోజులపాటు శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయానికి 9 మంది చొప్పున వీరిని ఎంపిక చేయగా, ఒక్కొక్కరు 70 మందికి శిక్షణ ఇస్తున్నారు.