NZB: భూ భారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తారాబాయి తెలిపారు. గురువారం ఆమె రుద్రుర్ మండలం రాణంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పలువురు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఎమ్మార్వో చెప్పారు. రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు.