AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం శుక్రవారంతో ముగిసింది. గ్రంథాలయాధికారి పీ.దమయంతి ఆధ్వర్యంలో ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన ఎంఈవో నాగేంద్ర మాట్లాడుతూ.. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే విద్యార్థులు తప్పనిసరిగా గ్రంథాలయాలకు రావాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.