కోనసీమ: రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గెద్దాడ విజయలక్ష్మి కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఆమెను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమెకు ఆర్థిక సాయంగా రూ.15 వేలు చెక్కును అందించారు.