గుంటూరు: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోసం అర్హులైన ఉపాధ్యాయుల ధ్రువీకరణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల జాబితా వెబ్సైట్లో ఉంచారు. గురువారం పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ బాలుర పాఠశాలలో ధ్రువీకరణ జరుగుతుందని DEO తెలిపారు. ఉదయం 8 నుంచి మున్సిపల్, మధ్యాహ్నం 3 నుంచి ఇతర యాజమాన్యాలకు ప్రక్రియ ఉంటుంది.