KKD: అన్న క్యాంటీన్ల ద్వారా సకాలంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి. భావన ఆదేశించారు. బుధవారం రాత్రి కాకినాడ వివేకానంద పార్క్ వద్దగల అన్న క్యాంటీన్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుంచి అన్న క్యాంటీన్లో ఎదురవుతున్న సమస్యలను, ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.