ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిభ అవార్డులకు పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ రబ్బానీ ముస్కాన్కు లభించిందని ఆమె తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు 988 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ స్ధానంలో నిలిచింది. దీంతో ప్రతిభ అవార్డుకు ఆమెను ఎంపిక చేయడం జరిగింది.