పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’ను ఆయన రీలాంచ్ చేశారు. ఢిల్లీలో జరిగిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ అనే కార్యక్రమంలో భాగంగా, భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ప్రధాని మోదీ ఒక మర్రి మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’ను తిరిగి ప్రారంభించారు.