TG: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. రోగుల అనారోగ్యానికి కలుషితమైన ఆహారమే కారణమనే కోణంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రికి ఆహారం సరఫరా చేసే జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి చెందగా.. 71 మంది చికిత్స పొందుతున్నారు.