ELR: ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన మంగళవారం పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహిక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ విండో కింద అందిన 52 దరఖాస్తుల్లో 51 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మిగిలిన ఒక దరఖాస్తు లీగల్ అండ్ మెట్రాలజీ వారి వద్ద పెండింగ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించని అధికారికి షోకాజ్ జారీ చేశారు.