WGL: జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణ కోసం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం జిల్లాలో కరోనా కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియంత్రణ చర్యలు సాగుతున్నాయని ఆయన తెలిపారు.