BDK: దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబల్లిలో గురువారం గ్రామస్థులు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన నిరుపేదలను విస్మరించి, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని BRS మండల కో-కన్వీనర్ కృష్ణ ఆరోపించారు. రాజకీయ లబ్దికోసం జరిగిన ఈ కేటాయింపులను ఖండిస్తూ, అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.