VZM: నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి నడుంబిగించాలని కోరారు. పర్యావరణం పరిరక్షణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.