కృష్ణా: చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవుల లారీని ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. గోవుల అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న భాజపా నాయకులు పోలీసుల సాయంతో లారీని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న లారీ నిర్వాహకుల నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.