ప్రకాశం: పొదిలిలో ఈనెల 11వ తేది పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాటలో భాగంగా పొదిలికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నట్లు జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం జగన్ పర్యటన ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జగనన్న పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.