కడప: బక్రీద్ పండుగ సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈద్గాల వద్ద బక్రీద్ ప్రార్థనల కోసం ముగ్గురు సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీలు, కానిస్టేబుల్, ఇతర సిబ్బంది మొత్తం 120 మందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆవులు, ఒంటెల రవాణాపై గట్టి నిఘా ఉంచామని పికేటింగ్, చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.