కడప: వీరపునాయునిపల్లెలో గత నెల 27న జరిగిన ఆంజనేయులు హత్యకు సంబంధించి నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ చల్లని దొర శుక్రవారం తెలిపారు. ఇంటి గోడ స్థలం, భూముల విషయంలో చాలాకాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం కమలాపురం కోర్టులో హాజరుపరిచారు.