SRPT: త్యాగానికి ప్రతీక అయిన ఈద్ ఉల్ ఆదా(బక్రీద్) సందర్భంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతి చాటే బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.