ADB: కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతులకు మొక్కల పెంపకంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.