మన్యం: జిల్లాలో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశం ఉందని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం సీతంపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మన్యం జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గంలో స్కిల్ హబ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.