MHBD: నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లిలో గత ఏడాది భారీ వర్షాల వల్ల వరదలతో రోడ్లు, చెరువు కట్ట దెబ్బతిన్నాయి. మంగళవారం మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత దెబ్బతిన్న చెరువు కట్టను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే మరమత్తు పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.