WGL: రాయపర్తి మండలంలో మంగళవారం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఎంపీడీవోకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణిపై వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామసభలు నిర్వహించకుండా, నిజమైన పేదలకు బదులు కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేస్తోందని ఆరోపించారు.