KRNL: కౌతాలం మండలంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో వరద నీరు తగ్గుముఖం పట్టింది. గత వారం కురిసిన వర్షాలతో నీరు నదిలో చేరి వరదలా ప్రవహించింది. దీంతో నదికి వరద పోటెత్తింది. నాలుగు రోజుల నుంచి వర్షం లేకపోవడంతో నదిలో నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో మండలంలో నదిచాగి, మరళి, గుడికంబాలి ఇసుక రీచ్ల నుంచి ఇసుక తవ్వకాలు, తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.