TG: 18ఏళ్ల కిందట జాగృతిని ప్రారంభించామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి ఉందన్నారు. గత తొమ్మిదేళ్లు కేసీఆర్ అద్భుతంగా పరిపాలన చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అని కూడా అనకపోవడం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. రేవంత్ రెడ్డి జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించాలని సవాల్ విసిరారు.