KDP: ప్రొద్దుటూరు అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాణిజ్యపరంగా ప్రొద్దుటూరు ఎంతో అభివృద్ధి చెందిందని దానిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.