ASR: కొయ్యూరు మండలం గోపవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధవల ధారబాబు కుమార్తె యోధశ్రీ (6)అనే చిన్నారి చికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ మృతి చెందింది. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారికి తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.