కోనసీమ: దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, సినీ హీరో ఆర్యన్ రాజేష్ ఓ శుభకార్యం నిమిత్తం మండపేట విచ్చేసి పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మండపేట ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావును కలిసి తన కుమారుడు, కుమార్తె ల పంచె కట్టు, వోణీల వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ను ఎమ్మెల్యే సత్కరించారు.