NZB: ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేకంగా జారీ చేసిన వేబిల్లులను అందించాలని సూచించారు.