NLR: సంగం మండల వ్యాప్తంగా శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా పాల్గొని వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామని ఆనం పేర్కొన్నారు.