KRNL: కలెక్టరేట్లో జూన్ 2 సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రాలు మున్సిపాలిటీల్లోనూ వినతులు స్వీకరిస్తారు. అర్జీల స్థితి తెలుసుకోవాలంటే 1100 నంబరుకు కాల్ చేయవచ్చని, అలాగే meekosam.ap.gov.inలో కూడా అర్జీలు నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు.