ATP: కళ్యాణదుర్గం నియోకవర్గంలోని కదిరిదేవరపల్లి నుంచి తిరుపతి రైలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభం అవుతున్నట్లు నైరుతి రైల్వే అదికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కదిరిదేవరపల్లి రైల్వే స్టేషనులో ఆధునికీకరణ పనుల నిమిత్తం 2023 డిసెంబరు నుంచి ఈ రైలు రాకపోకలు ఆగిపోయాయి. పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి రైలును యధావిధిగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు.