JN: దేవరుప్పుల మండలంలోని ఆయా గ్రామాల్లో జూన్ 3వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్ అండాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ సదస్సును నిర్వహిస్తారని, ఎవరికైనా భూ సమస్యలు ఉంటే సదస్సుల్లో దరఖాస్తు ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.