TG: సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ దాబాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన హెరాయిన్, గంజాయి, ఓపియం స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.