KMM: వాహనాలు నడిపిన 12 మంది మైనర్లకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మం నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా, వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచామని చెప్పారు. మైనర్లు ఎవరూ కూడా వాహనాలు నడపవద్దని సూచించారు.