BHNG: గుండాల మండలం సీతారాంపురంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాసుబుక్కు కలిగిన ప్రతి రైతు తమ గ్రామాలకు అనుబంధంగా ఉన్న రైతు వేదికల వద్ద పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు. నమోదు చేసుకున్న వారికి రైతు కిసాన్ కార్డు వస్తుందని అన్నారు.