KDP: వేంపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 1 నుంచి 3 రోజులపాటు ఆలయ పవిత్రోత్సవాలు, సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విశ్వనాధ్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంకురార్పణ, కుంభ ఆవాహనం, సుదర్శన హోమం, నారసింహ హోమం ధన్వంతరి మహావిష్ణు హోమాలు మహా పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.