కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం శివారులో గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని R&B ఈఈ కార్యాలయంలో వినతిపత్రాన్ని బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కొద్దిరోజుల్లో వర్షాలు కురిస్తే గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి ఇబ్బంది అవుతుందని రెండేళ్లుగా పనులు నడుస్తున్నట్లు, అధికారులు చొరవ తీసుకొని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.