CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అనివార్య కారణాల వల్ల రద్దైనట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం వచ్చేవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.