సత్యసాయి: విజయవాడలో శుక్రవారం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగాలపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు, ఉద్యోగుల బదిలీలపై పటిష్ట మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బదిలీ ప్రక్రియలో వందశాతం పారదర్శకత ఉండాలని, ఎలాంటి అవకతవకలు జరగకూడదని స్పష్టం చేశారు.