TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కాగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన ఎన్కౌంటర్లో ఇప్పటికే వేల మంది మావోలు మృతి చెందగా ఇటీవల మావో చీఫ్ నంబాల కేశవరావు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.