ELR: రాజాపోతేపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన ప్రకాష్ (30)గా స్థానికులు చెబుతున్నారు. బైక్పై వెళ్తుండగా రాజుపోతేపల్లి అడ్డురోడ్డు వద్ద వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తుతో పాటు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.