కామారెడ్డి జిల్లాలో పని చేస్తున్న నలుగురు అధికారులు పదవీ విరమణ పొందిన సందర్బంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సన్మాన సభ జరిగింది. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఎన్. భీమ్ కుమార్, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. ప్రభాకర్, కలెక్టరేట్, సూపరింటెండెంట్ జయంత్ రెడ్డి, దోమకొండ మండల తహసీల్దార్ సంజయ్ రావు పదవీ విరమణ సన్మానంలో ఉన్నారు.