NLR: విడవలూరు మండలంలోని దంపూరు గ్రామంలో శనివారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. పంటలకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. శాస్త్రవేత్తలు సలహాల మేరకు పంటలకు ఎరువులు వాడుకోవాలన్నారు. భూసార పరీక్షలు ఆధారంగా పంటలకు ఎరువులు వేసుకోవాలని సూచించారు.